కుటుంబ‌స‌‌మేతంగా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రి కొడాలి నాని


అమ్మ‌వారి కృపాకాటాక్షాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి…
దుర్గమ్మ కృపాకాటాక్షాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాల‌ని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ఆకాంక్షించారు. దసరా శరన్నవారాత్రుల్లో భాగంగా 6వ రోజైన గురువారం ‌ఇంద్రకీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత కనకదుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు మంత్రి దంపతులకు అమ్మ‌వారి దర్శనం చేయించారు. అనంత‌రం ఆలయ పండితులు వేద వేదమంత్రాల‌తో ఆశీర్వచనం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నానీ దంప‌తుల‌కు ఈవో సురేష్‌బాబు, పండితులు కనకదుర్గమ్మ ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

About The Author