ప్రముఖ టివి యాంకర్, నటి రష్మి గౌతమకు కరోనా…


హైదరాబాద్ : ప్రముఖ టివి యాంకర్, నటి రష్మి గౌతమ్ కరోనా బారిన పడ్డారు. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో రష్మి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తనకు కరోనా సోకినట్టు రష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా సోకడంతో రష్మి ఈనెల 28వ తేదీ వరకు షూటింగ్ లను రద్దు చేసుకున్నారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు, తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రష్మి సూచించారు. రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా త్వరలో విడుదల కానుంది.

About The Author