దుబ్బాక‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం -మ‌ంత్రి హ‌రీష్ రావు గారు


దుబ్బాక ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని మంత్రి హ‌రీష్ రావు గారు ధీమా వ్య‌క్తం చేశారు. దౌల్తాబాద్ మండ‌ల ప‌రిధిలోని గోవిందాపూర్‌, పోసాన్‌ప‌ల్లి గ్రామాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు గారు మాట్లాడుతూ.. ఐదేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాల‌న‌లో అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మోటార్లు అని మంత్రి ఎద్దెవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతుల‌కు ఉచితంగా నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను అందిస్తుంద‌న్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఇంటింటికీ త్రాగునీరు అందించామ‌న్నారు. పేదింటి ఆడ‌పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు ల‌క్ష నూట ప‌ద‌హారు రూపాయాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. కేసీఆర్ కిట్‌తో పాటు రూ. 12 వేల న‌గ‌దు ఇస్తున్నామ‌ని చెప్పారు. బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని గుర్తు చేశారు. నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌కు మారు పేరైన పోసాన్‌ప‌ల్లి గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుకుందామ‌ని మంత్రి హ‌రీష్ రావు గారు పిలుపునిచ్చారు.

About The Author