పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

9స్టార్,టివి,25/10/2020,చిత్తూరు జిల్లా:పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు గ్రామంలో పేదలకు గురుమై సాంతమిళ్ శ్రీ సాయి దర్శన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానిక ఏఎంసీ మాజీ చైర్మన్  ఇలంగోవన్ రెడ్డి కోరిక మేరకు తమిళనాడులోని కన్నికాపురం కు చెందిన ట్రస్టు నిర్వాహకులు డి కన్నణ్, కే దివ్య లు ఉదయం 9 గంటలకు నిత్యావసర వస్తువుల తో రెప్పాలపట్టు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో పేద ప్రజలు  పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి తమ వంతు సహాయంగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పేద ప్రజలను ఆదుకున్న ట్రస్టు నిర్వాహకులు కన్నన్, దివ్య లకు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పార్తిబన్, సెల్వం, రమేష్, నాయకులు వాసు, దొర వేలు తదితరులు పాల్గొన్నారు.

About The Author