దుబ్బాక ఎన్నికలు ముగిసిన సందర్భంగా మంత్రి శ్రీ హరీష్ రావు గారు మాట్లాడుతూ..


– దుబ్బాక ఉప ఎన్నికల్లో కరోనా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఓటు హక్కు ను వినియోగించుకున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికి ధన్యవాదాలు..

– ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు , కార్యకర్తలందరికి , అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు

– ఎన్నో ఒత్తిడిలు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ సంయమనం తో వ్యవహరించి సజావుగా జరిపించిన ఎన్నికల సంఘానికి , పోలీస్ సిబ్బందికి, యావత్ జిల్లా యంత్రాంగానికి అభినందనలు

– ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు రాష్ట్రం మరియు జిల్లా నుండి ఇంత కరోనా ఉన్న శ్రమిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేర వేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు..

– ఈ ఎన్నికల్లో మొదటి నుండి చివరి నిమిషం వరకు కూడా బిజెపి గోబెల్స్ , అబద్దపు ప్రచారాలను చేస్తూ వచ్చింది..

– ఇవ్వందాన్ని ఇచ్చినట్టు… చేయనిదాన్ని చేసి నట్టు వారి ఝటా మాటలతో, కుట్రలతో, అల్లర్లతో డబ్బుల ప్రవాహలు ప్రలోభాలకు తెరలేపారు..

– చివరి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్టు ఒక ఫెక్ న్యూస్ ను క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి పరాకాష్ట కు నిదర్శనం అని నిరూపించుకున్నారు..

– ఎన్నికల రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో కరెంట్ కట్ చేసి దొంగ ఓట్లు వేస్తారు అని మా పార్టీ పై అబద్దపు ప్రచారానికి ఓడి గట్టడం హాస్యాస్పదం…

– బీజేపీ గెలిచి పోయింది అని తప్పుడు వాయిస్ కాల్స్ పంపుతు ప్రజల్లో అయోమయంలో పడేసే ప్రయత్నం చేసారు..

– రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పిసిసి , రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులు మూటలతో వచ్చి ప్రచారం చేసిన ప్రజలు తిప్పికొట్టారు..

– ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుపు తథ్యం..

– పెరిగిన పోలింగ్ శాతం అనుకూలత టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం…

– టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకమ్ విశ్వాసం సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించారు.

About The Author