వీరమరణం పొందిన “తెలంగాణ బిడ్డా


తీవ్రవాదుల చొరబాటును అడ్డుకున్నారు
మాతృదేశం కోసం ప్రాణాలను అర్పించారు
వీరమరణం పొందిన “తెలంగాణ బిడ్డా”
జమ్మూకాశ్మీర్ – పాకిస్థాన్ సరిహద్దులోని కుపువార్ ప్రాంతం నుంచి తీవ్రవాదుల చొరబాటును మన సైనికులు అడ్డుకున్నారు. భారీ మందుగుండుతో నిన్న భారత్ లోకి చొరబడుతున్న వీరిని మచిల్ వద్ద నిలవరించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు కరడుగట్టిన తీవ్రవాదులను మన సైనికులు మట్టుబెట్టారు. ఈ క్రమంలో మన ముగ్గురు వీర జవాన్లు కూడా నేల కొరిగారు. వీరిలో మద్రాసు రెజిమెంట్ చెందిన కెప్టెన్ అశుతోష్ కుమార్, సైనికులు ప్రవీణ్ కుమార్, ర్యాడా మహేశ్వర్ లు ఉన్నారు.
– తెలంగాణ బిడ్డ –
వీర మరణం పొందిన ర్యాడా మహేశ్వర్ తెలంగాణ వాసి. నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, కొమన్పల్లి గ్రామానికి చెందిన వాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంకరి జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసి నేరుగా సైన్యంలో ఉద్యోగం సాధించాడు.
వీరి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని దేవునితో ప్రార్థిస్తు… వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్న.
జై జవాన్ … జై భారత్

About The Author