కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది ఆసిటీ లో కర్ఫ్యూ

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి తర్వాత పలు నగరాల్లో భారీగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పండగలు వేళ జనాలు గుంపులుగా కలిసి తిరగడం, చలి కాలం ప్రారంభమైన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా నమోదువుతన్నాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్ నగర యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కేవంల పాల షాపులు, మెడికల్ దుకాణాలకు మాత్రమే అనుమతి వచ్చింది. మిగతా అన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

About The Author