రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి.


రైల్వే కోడూరు మండలం లోని బాలుపల్లె చెక్పోస్టు కుక్కల దొడ్డి మార్గ మధ్యలో ప్రధాన రహదారిపై గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతికి చెందిన కార్తీక్ రాజేంద్రన్(38) భార్య ఉమామహేశ్వరి(32) కుటుంబ సమేతంగా కోడూరులో వివాహానికి హాజరై తిరిగి తిరుపతికి వెళుతున్న సమయంలో కుక్కల దొడ్డి సమీపంలో రోడ్డు వరద నీటి కోతకు గురై దెబ్బతిన డంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి ప్రమాదం జరిగిందని దంపతులిరువురూ అక్కడికక్కడే మృతి చెందగా ఇరువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట కు తరలించినట్లు పెద్ద ఓబన్న తెలిపారు.

About The Author