ఓ కూతురు ఘాతుకం .. అమ్మను ఆయాను చేసి.. తండ్రిని ఆనాదగా వదిలేసి…


ఓ కూతురు ఘాతుకం ..
అమ్మను ఆయాను చేసి.. తండ్రిని ఆనాదగా వదిలేసి..

కన్నబిడ్డలు విదేశాల్లో ఉంటే కాన్పులు ,పురుళ్ళు సమయంలోనే తల్లితండ్రులను పిలిపించుకుంటారు.. అమ్మ ఆయా పనిచేస్తున్నా కూతురికి సేవ చేస్తున్నాననే తృప్తే ఆ తల్లికి చాలు.. అయితే చాలామంది ఎన్నారై బిడ్డలు అమ్మను ఆయాగా చూస్తున్నారన్న నిజం అందరికీతెలిసినా తల్లి మాత్రం ఇది తన ధర్మమే అంటుంది.. తల్లిని మాయమాటలతో తీసుకెళ్లి తండ్రిని అనాధనుచేసి తల్లిచేత తనబిడ్డలకు సేవచేయించుకుంటున్న ఓ కూతురు కసాయితనమిది. తన భార్యను ఎలాగైనా తనవద్దకు వచ్చేలా చూడాలని ముసలి భర్త కూతురుపైనే కర్ణాటకలోని కృష్ణరాజపురం కోర్టుకు ఎక్కాడు.
ఇక్కడ ఓ కుమార్తె తన తల్లిని తన బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి నమ్మించి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన ఘటనపై ఇక్కడి కేఆర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. మునియప్ప లేఔట్‌కు చెందిన కృష్ణకుమారి, మృత్యుంజయ దంపతులకు గీతామణి, వరుణ్‌ ఇద్దరు బిడ్డలు. గీతామణికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిపించగా ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారి పిల్లల బాగోగులను చూసుకోవడానికి ఆస్ట్రేలియా రావాలని తల్లిదండ్రులను కోరింది. ఇద్దరు నిరాకరించారు. మాయమాటలతో తల్లిని ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది. తిరిగి ఇండియాకు పంపించలేదు. తమిళనాడులో ఉంటున్న కుమారుడు వరుణ్‌ కూడా తండ్రిని నిర్లక్ష్యం చేయసాగాడు. దీంతో మృత్యుంజయ తన భార్యను ఇండియాకు రప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

About The Author