న‌టిపై అస‌భ్య‌క‌ర పోస్టులు …సీపీకి ఫిర్యాదు


న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై త‌న‌దైన శైలిలో ఆమె ఎప్ప‌టిక‌ప్పుడూ స్పందిస్తూ ఉంటారు.
ఒక్కోసారి షాకింగ్ పోస్టింగ్‌లు కూడా పెడుతుంటారు. ఆ మ‌ధ్య త‌న ఫేస్‌బుక్ ఖాతాలో చ‌చ్చిపోవాల‌ని ఉందంటూ పోస్టు పెట్టి హ‌డ‌లెత్తించారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.
ఆ త‌ర్వాత తానెందుకు ఆ పోస్టు పెట్టాల్సి వ‌చ్చిందో వివ‌రించి కూల్ చేశారు. మైగ్రేన్‌, జ్వ‌రం, త‌ల‌నొప్పి, నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌తో తాను బాధ‌ప‌డుతున్నాన‌ని, దీంతో రోజూ ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి వ‌స్తోంద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.
తాజాగా ఆమె త‌న‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఉద్దేశపూర్వ‌కంగా దూషిస్తున్నార‌ని, అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నార‌ని , నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు ఫిర్యాదు చేశారు.
అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో త‌న‌ను టార్గెట్ చేసి అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతోంద‌ని వాపోయారు. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో తాను కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఈ దుష్ర్ప‌చారం త‌న‌ను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తోందన్నారు. త‌న‌పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

About The Author