త‌న విడాకుల‌కు కొత్త భాష్యం చెప్పిన ముద్దుగుమ్మ‌


ఏడడుగుల బంధానికి ఎనిమిది నెల‌లకే ముగింపు ప‌ల‌క‌డంపై నటి శ్వేతాబ‌సుప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘కొత్త బంగారులోకం’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు ఫ‌స్ట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టారు.
బాలనటిగానే జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు అందుకున్న ఆమె ఆ త‌ర్వాత ఓ ఊబిలాంటి స‌మ‌స్య‌లో ఇరుక్కున్నారు. పోలీసుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.
2018లో డైరెక్ట‌ర్ రోహిత్‌మిట్ట‌ల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగ‌లేదు. ఎనిమిది నెల‌ల‌కే వాళ్లిద్ధ‌రి మూడుముళ్ల బంధానికి చిల్లులు ప‌డ్డాయి. దీంతో విడిపోయారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వివాహ బంధం విచ్ఛిన్నం కావ‌డం గురించి శ్వేతాబ‌సుప్ర‌సాద్ మ‌న‌సులో మాట చెప్పుకొచ్చారు. త‌న విడాకుల‌కు ఆమె కొత్త భాష్యం చెప్పారు.
కొన్ని అనివార్య కార‌ణాల‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు. పెళ్లి అయిన త‌ర్వాత ప‌దేళ్లు, అంత‌కంటే ఎక్కువ సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా విడిపోయిన దంప‌తులున్నార‌న్నారు. కానీ తాము మాత్రం ఎనిమిది నెల‌ల్లోనే దూరం కావాల్సి వ‌చ్చింద‌న్నారు.
కాబట్టి దీన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. ఇది ఓ బ్రేకప్‌లా ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. నిజానికి రోహిత్‌కు దూరమైన ఆ సమయంలో ఎంతో బాధపడిన‌ట్టు శ్వేతాబ‌సుప్ర‌సాద్ తెలిపారు.
ప్రేమ వివాహం కావ‌డంతో పెంచుకున్న అనుబంధంలో పొర‌లు ఏర్ప‌డ‌డం బాధించింద‌న్నారు. త‌న‌కు కుటుంబం, స్నేహితులు అండగా ఉన్నార‌న్నారు. అన్నిటికి మించి త‌న‌కు తాను ఓ మంచి స్నేహితురాలిగా మారిన‌ట్టు శ్వేతాబ‌సు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

About The Author