ఇది చదువుతుంటే కళ్ళనిండా నీరే…


వివాహేతర సంబంధాలు, దాని వల్ల జరిగే నేరాలు కేవలం ఒక్క భారత్ కు మాత్రమే పరిమితం కాదండోయ్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అక్రమ సంబంధాల వల్ల ఘోరాలు జరుగుతున్నాయి. తనను నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో కలిసి ఉంటున్నాడన్న కారణంతో భర్తలను చంపేస్తున్న విదేశీ మహిళల ఉదంతాలు కోకొల్లలు. అదే విధంగా తనతో సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడన్న కారణంతో దారుణాలకు తెగించిన ప్రేమికురాళ్లు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఫ్రికాలో జరిగింది. తనతో సహజీవనం చేసిన వ్యక్తి మరో యువతితో పెళ్లికి సిద్ధపడటం ఆ మహిళకు నచ్చలేదు. తన ప్రియుడికి ఈ విషయమై చెప్పి చూసింది. కానీ ఆ ప్రియుడు ససేమిరా అన్నాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది.
అతడిపై దాడి చేసి చంపేసింది. అంతటితో ఆగలేదండోయ్. ఆ హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు అతడిని ముక్కలు ముక్కలుగా చేసి మర్మాంగాలతో బిర్యానీ వండి ఇతరులతో తినిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరాఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఓ వ్యక్తితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. అతడితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంది. కానీ ఆ వ్యక్తి వేరే యువతిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడని ఆమెకు తెలిసింది. ఈ విషయమై అతడిని నిలదీసింది. దీంతో అతడు ‘అవును నిజమే. నేను మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు ఆమె అంటే చాలా ఇష్టం’ అని చెప్పాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. అతడితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే అతడి తలను గోడకు వేసి బలంగా బాదింది. దీంతో అక్కడికక్కడే అతడు మరణించాడు. ఈ విషయం తెలిస్తే తనను జైల్లో వేస్తారని భయపడిన ఆమె మరింత దారుణానికి తెగబడింది.

ప్రియుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. గ్రైండర్లో వేసి జ్యూస్ లా మార్చి బాత్రూంలోని కమోడ్ లో వేసి ఫ్లష్ చేసేది. ఇలా అతడి శవాన్ని దాదాపుగా మాయం చేసేసింది. అంతే కాదు. అతడి శరీరంలోని తొడ, మర్మాంగాలను కోసి వాటితో బిర్యానీ వండింది. ఆ బిర్యానీని పక్కనే పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది. బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాకపోవడంతో ప్రియుడి మిస్సింగ్ గురించి అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఉన్న ప్రేమ వ్యవహారాల గురించి ఆరా తీశారు.

దీంతో ఈ ప్రేమికురాలి గురించి తెలిసొచ్చింది. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు మొదట ఏమీ దొరకలేదు. కానీ బాత్రూంలో రక్తపు ఆనవాళ్లను గుర్తించి పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె ఇంట్లోని ప్రతీ వస్తువును క్షుణ్ణంగా వెతికితే మిక్సీలో రెండు దంతాలను గుర్తించారు. వాటిని ల్యాబ్ కు పంపిస్తే అవి ఆ ప్రేమికుడివే అని తేల్చారు. దీంతో ఆమెను నిలదీసి ప్రశ్నిస్తే ఆమె చెప్పింది విని అంతా షాకయ్యారు. అమెను అదుపులోకి తీసుకుని హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

About The Author