రూ.2 కోట్లు పారితోషికం కావాలంటున్న హీరోయిన్


ఆల్రెడీ ఆమె రేటు కోటి దాటేసింది. రీసెంట్ గా ఒప్పుకున్న ఓ సినిమాకు కోటిన్నరకు పైగా తీసుకుంటోంది. ఇలాంటి టైమ్ లో ఆమెపై 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటూ పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లు నిజమైతే తనకు కూడా హ్యాపీ అంటోంది హీరోయిన్ రష్మిక.
తను సినిమాకు 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాననే రూమర్ పై రష్మిక రియాక్ట్ అయింది. అదింకా తనకు కలగానే ఉందని చెప్పుకొచ్చింది. నిజంగానే ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
“సినిమాకు 2 కోట్లు తీసుకుంటున్నానని రాస్తున్నారు. కేవలం నా కలలో మాత్రమే ఆ ఫిగర్ ఉంది. చాలామంది ఇతర హీరోయిన్లతో నా పేమెంట్ ను కంపేర్ చేస్తున్నారు. నా కష్టానికి, నా పాపులారిటీకి తగ్గ పేమెంట్ ఇస్తున్నారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నిజమే, అందరూ అనుకుంటున్నట్టు నేను 2 కోట్ల రెమ్యూనరేషన్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.”
ఇలా తన పారితోషికంపై స్పందించింది రష్మిక. ప్రస్తుతం ఆమె కొత్త కథలు వినడం లేదు. కావాలనే తను ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన రష్మిక.. దానికి రీజన్ కూడా చెబుతోంది.
“ప్రస్తుతం నేను కొత్త కథలు వినడం మానేశాను. ఓ సినిమాకు ఓకే చెప్పి, అది సెట్స్ పైకి వచ్చేవరకు 6-7 నెలలు వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. అవి పూర్తిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇలాంటి టైమ్ లో కొత్త కథలు విని, ప్రొడక్షన్ హౌజ్ ను నేను వెయిటింగ్ లో పెట్టలేను.”
సౌందర్య లేదా శ్రీదేవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని అంటోంది రష్మిక. నటిగా ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి బయోపిక్స్ బాగా పనికొస్తాయని చెబుతోంది.

About The Author