వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. టీడీపీకి మద్దతు


హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్వగ్రామంలో వైసీపీకి ఎదురుగాలి వీచింది. అక్కడి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ది కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం. అక్కడ టీడీపీ మద్దతు అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గోరంట్ల మాధవ్‌కు దగ్గర బంధువు అవుతారు. దీంతో మధుకు మాధవ్ మద్దతు తోడవ్వడంతో ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. అయితే మాధవ్ తీరుపట్ల వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీని సమర్ధించకుండా బంధువుకు మద్దతిచ్చారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

About The Author