అత్యాచార ఘ‌ట‌న‌లో షాకింగ్ నిజాలు…


తెలంగాణ‌లో తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించిన ఫార్మ‌సీ విద్యార్థినిపై అత్యాచారం ఘ‌ట‌న అనూహ్య మ‌లుపు తిరిగింది. ఈ ఘ‌ట‌న‌లో విచార‌ణ చేప‌ట్టిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలిసొచ్చాయి. ఫార్మ‌సీ విద్యార్థిని త‌న అబ‌ద్ధాల‌తో మొత్తం స‌మాజాన్ని త‌ప్పుదారి ప‌ట్టించింద‌ని తేలింది.
ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలో ఫార్మ‌సీ విద్యార్థినిపై ఆటో డ్రైవ‌ర్లు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం క‌లిగించింది. దిశ హ‌త్యాచార ఘ‌ట‌న‌ను ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు తెచ్చుకుని తీవ్రంగా క‌ల‌త చెందారు. చ‌ట్టాలు ఎన్ని వ‌చ్చినా మ‌హిళ‌ల‌కు ప‌ట్ట ప‌గ‌లు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆవేద‌న చెందారు.
దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఫార్మ‌సీ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే విచార‌ణ చేప‌ట్టిన పోలీసుల‌కు షాక్ గురి చేసే నిజాలు వెలుగు చూశాయి.
బాధితురాలిని ప్ర‌శ్నించ‌డంతో ఘ‌ట‌న‌కు సంబంధించి వాస్త‌వాలు కొత్త విష‌యాల‌ను తెర‌పైకి తెచ్చాయి. పోలీసులు, త‌ల్లితండ్రులు, మీడియా …ఇలా మొత్తం వ్య‌వ‌స్థ‌నే త‌ప్పుదోవ ప‌ట్టించింద‌ని పోలీసులు నిర్ధారించుకున్నారు.
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు …బాధితురాలు వెల్ల‌డించిన షాకింగ్ నిజాలు ఇలా ఉన్నాయి. స‌ద‌రు యువ‌తి ఆటో ఎక్కి రాంప‌ల్లి వ‌ర‌కు వెళ్లింది. అక్క‌డ బైక్‌పై త‌న ప్రియుడితో క‌లిసి వెళ్లింది. అనంత‌రం అత‌ని ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి గంజాయి తాగింది. మ‌త్తులో జోగుతూ …తామే ప‌రిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియ‌ని దుస్థితి. ఆ యువ‌తి అనుమ‌తితోనే జ‌ర‌గ‌కూడ‌నిదే జ‌రిగింది.
ఇదే స‌మ‌యంలో త‌ల్లి ప‌దేప‌దే ఫోన్ చేస్తుండ‌డంతో విసిగిపోయిన యువ‌తి …త‌న‌ను ఆటో డ్రైవ‌ర్లు గుర్తు తెలియ‌ని ప్ర‌దేశానికి తీసుకెళ్లిన‌ట్టు చెప్పింది. దీంతో ఆ త‌ల్లి ఆందోళ‌న‌కు గురై పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ముమ్మ‌ర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
పోలీస్ వాహ‌న సైర‌న్లు వినిపించ‌డంతో ఆ యువ‌కులు భ‌య‌ప‌డ్డారు. ఆ యువ‌తిని ర‌హ‌దారి ప‌క్క‌నే విడిచి త‌మ దారిన తాము వెళ్లిపోయారు. ఎట్ట‌కేల‌కు పోలీసుల కంట ఆ యువ‌తి ప‌డింది. మ‌త్తులో తూగుతున్న యువ‌తిని పోలీసులు వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్‌ అనంత‌రం యువ‌తి తేరుకున్నారు.
పోలీసుల విచార‌ణ‌లో త‌న‌పై ఆటో డ్రైవ‌ర్లు అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని అబ‌ద్ధాలు చెప్పింది. అయితే అప్ప‌టికే ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్ర‌శ్నించారు. సీసీ కెమెరాలు బాధిత యువ‌తి అబ‌ద్ధాలు చెబుతున్న‌ట్టు ప‌ట్టించాయి.
సీసీ కెమెరాల‌ను పరిశీలించగా యువతి బైక్‌పై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు మ‌రో రూట్‌లో విచారించి అస‌లు విష‌యాల‌ను రాబ‌ట్టారు. బాయ్ ఫ్రెండ్స్‌తో క‌లిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లిన‌ట్టు, అక్క‌డ ఎంజాయ్ చేసిన‌ట్టు యువతి ఎట్ట‌కేల‌కు ఒప్పుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ సమాచారం. దీంతో షాక్‌కు గురి కావ‌డం పోలీసుల వంతైంది.

About The Author