తెర‌పైకి బిగ్‌బాస్‌ ప్రేమ జంట‌ క‌థ‌…


బిగ్‌బాస్ సీజ‌న్‌-4లో అఖిల్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ మ‌ధ్య హౌజ్‌లో న‌డిచిన ప్రేమాయ‌ణం బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఆ రియాల్టీ షో సాగినంత కాలం మోనాల్ కేంద్రంగా బిగ్‌బాస్ షోపై చ‌ర్చ న‌డించింది.
అఖిల్‌, మోనాల్ మ‌ధ్య ఎమోష‌న్స్‌ను దృష్టిలో పెట్టుకుని, వాళ్ల‌ద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘తెలుగబ్బాయి- గుజరాతీ అమ్మాయి’ టైటిల్‌తో వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఎ. భాస్క‌ర్‌రావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్ కూడా విడుద‌లైంది. ఈ వెబ్ సిరీస్‌పై ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ అఖిల్‌, మోనాల్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ రాసుకున్నాన‌న్నారు. ప్రేమ‌, స్నేహం, అనుబంధాల క‌ల‌బోత‌గా సిరీస్ ఉంటుంద‌న్నారు.
గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ అమ్మాయికి, పల్లెటూరి నుంచి సిటీలో అడుగుపెట్టిన ఓ మధ్య తరగతి అబ్బాయి మధ్య ప్రేమకథ న‌డుస్తుంద‌న్నారు. వెబ్ సిరీస్ హీరో అఖిల్ మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కోసం ప‌ల్లెటూరి నుంచి నగరానికి వచ్చే యువకుడిగా తాను కనిపిస్తానన్నారు. ఆరు భాగాలుగా వెబ్‌సిరీస్ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు నిర్మాత తెలిపారు.

About The Author