తిరుపతి ఎంపీ టిక్కెట్టు జనసేనకే…!!


తిరుపతి ఎంపీ సీటు పోత్తు లో భాగంగా జనసేనకు కేటాయించేందుకు బిజిపి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు బీజేపీ లో బలంగా ప్రచారం జరుగుతోంది.తిరుపతిలో ఏపీ బీజేపీ నాయకత్వం బీజేపీ నాయకుడినే బరిలోకి దించాలని అధిష్టానానికి సూచించింది.అయితే ఆపార్టీ కేంద్ర నాయకత్వం తమకు అత్యంత సన్నిహితులతో చేయించుకున్న సర్వే లు, ఏపీ బీజేపీ నాయకులు చెప్పిన దానికి భిన్నంగా ఉండటంతో బిజెపి కేంద్ర నాయకత్వం జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దు అయినట్టు బీజీపీ లో చర్చ జరుగుతుంది.ఇంతే కాకుండా జనసేన పార్టీ టీడీపీ కు దగ్గర అవుతుందనే ప్రచారంతో బీజేపీ కేంద్ర నాయకులు అప్రమత్తమై ఆమైత్రీ కుదిరితే బీజేపీ ఏపీలో ఒంటరి అవుతుందని గ్రహించి,రాబోయే మైత్రీ, తిరుపతిలో ఓటు బ్యాంక్ ను దృష్టిలో ఉంచుకొని తిరుపతి సీటు జనసేనకు కేటాయించబోతుంది…*

About The Author