మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ నాటకం..


మళ్ళీ ఓ అమ్మాయి కిడ్నాప్ నాటకం.. తల్లితండ్రులను నమ్మించే ప్రయత్నం , పోలీసులను బురిడీ కొట్టించే పన్నాగం ..చివరకు గుట్టురట్టుఅయిన వైనం.. విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి పొలాల్లో పడేసినట్లుగా నమోదైన కేసులో మిస్టరీ వీడింది. ఈ కిడ్నాప్ నాటకం ఆ విద్యార్థిని ‘కట్టు’కథ అని పోలీసుల విచారణలో తేలింది.డిగ్రీ చదివే అమ్మాయి గత నెల 27 తేదీ బాబాయి ఇంటికిపోతున్నానని హాస్టల్లో పర్మిషన్ తీసుకుంది. అదే సమయంలో అమ్మాయి అన్నయ్య ఆమెగురించి హాస్టల్లో అడిగాడు. అయితే ఆమె బాబాయి ఇంటికి కాకుండా తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళింది. అన్న హాస్టల్లో విచారించిన విషయం తెలియడంతో కిడ్నాప్ డ్రామా ఆడింది.
స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత బస్సు దిగిన యువతి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా యాక్షన్ చేసింది. ఈ మేరకు తన తప్పును ఎస్పీ ముందు ఒప్పుకుంది.

About The Author