భర్త సెక్స్ కోసం వేధిస్తున్నాడట – అందుకే అన్నంలో..


ఓ భార్య తన భర్తకు భోజనం పెట్టింది.. కూర చేదుగా ఉందని భర్త అడిగాడు.. నీకు నోరుబాగాలేదేమో అని చెప్పి మొత్తానికి అన్నం తినిపించింది. గంట తరువాత భర్తకు , వాంతులు ,విరేచనాలు .. అదిఇదిఅంటూ దాటవేసింది. ఉదయానికి హాస్పిటల్ కి పోదామని చెప్పింది.. భర్తకు ఏదో అనుమానమొచ్చింది.. తమవాళ్లకు ఫోన్ చేసి హాస్పిటల్ కి పోదామన్నాడు.హాస్పిటల్లో పరీక్ష చేస్తే , బ్లెడ్ లో విషం ఛాయలు కనిపించాయి.. మలమూత్ర పరీక్షల్లోనూ ప్రమాదకరమైన విషం కలిపినట్టు తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు మరణవాగ్మూలం తీసుకున్నారు. తన భార్య భోజనంలో విషం కలిపిందన్న అనుమానాన్ని భర్త వ్యక్తంచేశాడు. ఆమెను నిలదీస్తే నిజమేనని ఒప్పుకుంది.21 ఏళ్ళ మైధిలీకి చెన్నైకి చెందిన నందకుమార్ తో 8 నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు ఆమె ఐదో నెల గర్భిణీ . నందకుమార్ కి ఇది రెండో పెళ్లి. అతడికి 35 , ఆమెకు 21 ఏళ్ళు. ఐదోనెల గర్భంతో ఉన్నతనను సెక్స్ కోసం వేధిస్తున్నాడని , అందుకే భోజనంలో విషంపెట్టి చంపేశానని చెప్పింది. అయితే నందకుమార్ బంధువులు ఆమె మాటలు నమ్మడంలేదని చెప్పారు. పెళ్ళికాకముందు అక్రమ సంబంధం కారణంగానే ఆమె ఇంత దారుణానికి పూనుకుందని అనుమానిస్తున్నారు..

About The Author