భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య


వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. గత నెలలో అదృశ్యమైన గగన్‌ అగర్వాల్‌(38) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. అతడి రెండో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. వివరాలు… రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్‌ అగర్వాల్‌, గత జూన్‌లో నౌసిన్‌ బేగం(మరియాద)ను పెళ్లి చేసుకున్నాడు. అంతా సక్రమంగా సాగుతుందనుకుంటున్న సమయంలో, ఫిబ్రవరి 8న గగన్‌ అదృశ్యమయ్యాడు.ఈ క్రమంలో.. నౌసిన్‌, గగన్‌ సోదరుడు ఎల్బీ నగర్‌ పోలీసులను ఆశ్రయించగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. గగన్‌ను హత్య చేసిన నౌసిన్‌, తమ ఇంట్లోనే అతడిని పూడ్చిపెట్టినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

About The Author