తండ్రికి కరోనా… ప్రేమ ఆగునా!…


కరోనా.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన మృతిచెందారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం జరిగింది. జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు ( 44 ), విజయవాడలో కూలి పనులు చేసుకు నేవారు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కుటుంబసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు. స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు . వెళ్లేందుకు ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా…కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక కుమార్తె వెళ్లి ఆయన గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే ఆయన తుదిశ్వాస విడిచాడు.

About The Author