కరోనా పేషెంట్​ మెడలో పుస్తెలతాడు మాయం


కరోనా వైరస్ సోకి దవాఖానాలో చికిత్స పొందతూ మృతి చెందిన పేషెంట్ మెడలో పుస్తెలతాడు మాయమైన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన సద్దినేని సాయమ్మకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కుటుంబ సభ్యులు చికిత్స కోసం సాయమ్మను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 3గంటల సమయంలో ఆమె కన్నుమూసింది. ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న సమయంలో బంగారు కమ్మలు మాత్రమే అప్పగించారు. మెడలో ఉండాల్సిన రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. బాధితురాలి మెడలో పుస్తెలతాడు లేదంటూ ఆస్పత్రి సిబ్బంది చెప్తున్నారు. కంగారులో ఆమె మెడలో నగలేవీ తీయలేదని.. అలాగే హాస్పిటల్​కి తీసుకొచ్చామని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

About The Author