పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!


గత కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆచూకీ ఎట్టకేలకు లభించింది. భీమవరంలో ఆయనను రామగుండం పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి రామగుండం తరలించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే మధు ‘గాయబ్‌’ అయ్యారు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండగా, పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది.ముఖ్యంగా అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారని వార్తలు వినిపించగా, తాజాగా భీమవరంలో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. అయితే వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారా లేదా వేరే ఇతర కేసులో ఆయనను విచారిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

About The Author