‘త్వరలోనే అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్‌ నెం.1 టీం’


వరుస విజయాల పరంపరను కొనసాగిస్తోన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పై మాజీ ఆల్‌రౌండర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న రోజుల్లో అన్ని క్రికెట్‌ ఫార్మాట్లలో పాకిస్థాన్‌ జట్టు నెం. 1 టీమ్‌ గా అవతారమెత్తబోతుందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు ఆటతీరుతో త్వరలోనే ఐసీసీ ర్యాకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపర్చుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సంవత్సరం పాకిస్థాన్‌ జట్టు బాబర్ అజామ్ నేతృత్వంలో టీం మంచి ఫామ్‌ను కొనసాగించడం మంచి శకునమని మాజీ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు.పాకిస్థాన్‌ ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో, పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. దాంతోపాటుగా నాలుగు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీస్‌లో విజయకేతనం ఎగరవేశారు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1తో గెలిచారు. కాగా ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండు మ్యాచులను గెలిచి టెస్ట్‌ సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు టెస్ట్‌ క్రికిట్‌లో ఐదవ స్థానంలో, వన్డేలో ఆరవ స్థానంలో, టీ20ల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

About The Author