జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలు


జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలు
*కోవిడ్ వారియర్స్ గా ప్రకటించాలి
*కోవిడ్ వలన చనిపోయిన జర్నలిస్టులకు తక్షణం పరిహరం అందచేయాలి
*జియస్టీ తోలగించాలి
విజయవాడ,మే24:జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం.ఆధ్వర్యంలో చర్చీలో ,శివాలయంలో సర్వ మత ప్రార్ధనలు జరిపారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో అనుక్షణం ముందంటు వ్యవస్థలకి నాలుగో స్తంభంలా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్ట్ మిత్రులు కోరారు.కరోనా కాటుకు బలి ఆవుతున్న జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని కోవిడ్ వలన భాధితులకు తక్షణమే 20వేల రుపాయలు,కోవిడ్ వలన మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5లక్షల రుపాయలు అందచేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ప్రతి విషయంలోనూ ముందుండి ప్రపంచానికి తెలియచెప్పే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించకపోవడం శోచనీయమని జర్నలిస్ట్ మిత్రులు ఆవేధన వ్యక్తం చేశారు.పత్రికలు వ్యాపారం చేయడం లేదని సేవ చేస్తున్నారని అటువంటి వారికి జియస్టీ ఏమిటని ప్రశ్నించారు.తక్షణమే జియస్టీ ఏత్తివేయాలని జర్నలిస్ట్ మిత్రులు డిమాండ్ చేశారు.

About The Author