సీనియర్ జర్నలిస్ట్ నూర్ బాషా కు ఘన నివాళి


తాడిపత్రి లో ఈ నెల 20 న కరోనా వైరస్ తో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ NTV రిపోర్టర్ నూర్ బాషా కు తాడిపత్రి జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్లోని గాంధీ విగ్రహం ముందు నూర్ బాషా చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో మౌనం పాటించారు. తాడిపత్రి లో విలేకరుల సమస్యలపై ఎప్పుడూ ముందుండే నూర్ బాషా గారు మృతి చెందడం చాలా బాధాకరం అని ఈ సందర్బంగా జర్నలిస్ట్ లు పేర్కొన్నారు. నూర్ బాషా కుటుంబాన్ని ప్రభుత్వం ,యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని జర్నలిస్ట్ లు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

About The Author