పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా.. సీఎం సహాయ నిధి…

-సిద్ధిపేట నియోజకవర్గంలో 19మందికి రూ. 5.34 లక్షల చెక్కుల పంపిణి చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు..

పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోంది అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు..నియోజకవర్గం సిద్దిపేట పట్టణానికి చెందిన 19మందికి తన నివాసంలో సీఎం సహాయ నిధి ద్వారా ₹5,34లక్షల చెక్కుల పంపిణీ చేశారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో మంది అకస్మాత్తుగా ప్రమాదాల బారిన పడటం…కొంత మంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం..వారికి ఆర్థిక స్థోమత లేక..ఆందోళన చెందుతూ ఇబ్బందులు పడుతుంటారు..అలాంటి వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటామని అన్నారు…ఇది పేదలకు వరం అని తెలియజేశారు.. పట్టణంలో 19మందికి చెక్కుల పంపిణీ చేశారు. సత్యనారాయణ – ₹2,30లక్షలు , శ్రీనివాస్ -₹ 60,000, భూ లక్ష్మీ ₹60,000 , భారతమ్మ ₹15000, శివ శంకర్ ₹15000, రాజమణి -₹12,500, ఎండి రాజ్ ₹42,500 , శంకరా చారి ₹25000 , సోమయ్య – ₹60,000 , అశ్వక్ ₹25000, హర్షవర్ధన్ ₹57000 , యాదమ్మ ₹7,500 , గోపాల్ ₹25000 , శ్రీనివాస్ ₹10,000 , ఫణీంద్ర ₹15000, స్రవంతి ₹ 9000, బాల్ రాజ్ ₹60,000 , లక్ష్మి ₹12000, బస్తవ్వ ₹23000…మొత్తంగా ₹5,34లక్షలు చెక్కుల పంపిణీ చేశారు…

About The Author