తల్లి ఒడినుంచి బిడ్డను లాక్కెళ్లి చంపేసింది…

తల్లి ఒడినుంచి బిడ్డను లాక్కెళ్లి చంపేసింది…

పశ్చిమ్‌బంగాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని చిరుతపులి లాక్కెళ్లి చంపేసింది. అలీపుర్‌దవార్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలీపుర్‌దవార్ జిల్లాలోని లేబర్‌ లైన్‌లో నివాసముంటున్న పూజ ఓరాన్‌ ఇంట్లోకి మంగళవారం రాత్రి చిరుతపులి ప్రవేశించింది. ఆ సమయంలో పూజ తన మూడేళ్ల కుమార్తె ప్రణీతను నిద్రపుచ్చుతోంది. ఇంటి లోపలికి వచ్చిన చిరుత వీరిపై దాడి చేసింది. పూజ ఒడిలో ఉన్న చిన్నారిని నోట కరుచుకుని వెళ్లింది. కుమార్తెను కాపాడుకునేందుకు పూజ చిరుతతో పోరాడినప్పటికీ అది ఫలించలేదు.
పూజ అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని చిన్నారి కోసం గాలించారు. చిన్నారి కన్పించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం ఉదయం మదరిహత్‌లోని ఓ తేయాకు తోటలో చిన్నారి శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.

About The Author