శ్రీశైల దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన..


శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుదూరం నుంచి భక్తులు మొక్కు చెల్లించేందుకు వస్తే కల్యాణకట్టను మూసివేయటం ఏంటని, వెంటనే తెరవాలని డిమాండ్‌ చేశారు. తలనీలాల సమర్పణకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని భక్తులకు సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు. కొవిడ్‌ దృష్ట్యా గత నెల కల్యాణకట్టను ఆలయ అధికారులు మూసివేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం నేటి నుంచి కర్ఫ్యూవేళలను సడలించడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

About The Author