లారీ సహా 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

స్మగ్లర్లు ఆచూకీ కోసం టాస్క్ ఫోర్స్ కూంబింగ్

చిత్తూరు జిల్లా:పీలేరు రోడ్డు లోని భాకరాపేట అడవుల్లో లారీలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లోడ్ అవుతున్న అశోక్ లేలేండ్ 10 టైర్ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు సి ఐ చంద్రశేఖర్, ఆర్ ఎస్ ఐలు లింగాధర్, సురేష్ టీమ్ మంగళవారం తెల్లవారుజామున భాకరాపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఒక ప్రాంతంలో లారీ కనిపించడం తో అక్కడకు చేరుకున్నారు. టిఎన్ 48 జెడ్ 8137 నెంబరు కల ఈ లారీలో 8 ఎర్రచందనం దుంగలు ఉండగా, మరో ఆరు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలను పడవేసి చీకట్లో కలసి పోయారు. సిఐ చంద్రశేఖర్ బృందం 14 ఎర్ర చందనం దుంగలతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసును సిఐ వెంకట్ రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీధర్, సిఐ సుబ్రమణ్యం, ఎఫ్ ఆర్ ఓలు ప్రసాద్,ప్రేమ ఆర్ ఎస్ ఐ విశ్వనాధ్ పాల్గొనగా, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది కి, ఎస్పీ సుందర రావు రివార్డులు ప్రకటించారు.

About The Author