ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం నియమించింది. గతంలోనూ అనిల్ తితిదే ఈవోగా పనిచేశారు.
ప్రస్తుత ఈవో శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.
రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, అటవీ,పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బదిలీ అయ్యారు.
*ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు*
▪️టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్.
▪️ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.
▪️మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్.
▪️సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు.
▪️ఎక్సైజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్ కుమార్ మీనా.
▪️అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే.
▪️గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్.
▪️మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్.
▪️ ఎండోమెంట్స్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్ (రిటైర్డ్)
▪️లేబర్, ఇన్సూరెన్స్ మెడికల్ కార్యదర్శిగా ఏం.వి.శేషగిరిబాబు.
▪️ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ)గా ప్రవీణ్కుమార్ బదిలీ.