నిరుపేద నాన్నను గెలిపించిన పిల్లలు…


రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ ని అటల్ బంద్ ఏరియాకి చెందిన గోవింద్ కుమార్ రోడ్డుపై తోపుడుబండి పెట్టుకుని పకోడీ వంటి చిరుతిళ్లు అమ్మేవాడు. గోవింద్ కుమార్ తన భార్య , నలుగురు పిల్లలని పోషించడానికి ఎండనక వాననక కష్ట పడ్డాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన ఈ పకోడీవాలా కూతురే జార్ఖండ్ కేడర్ ఐఎఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి.

దీపేష్ కుమారి తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి 25 సంవత్సరాలుగా వీధిలో పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఆరుగుఋ సభ్యుల కుటుంబం.. పరిమిత వనరులతో ఒకే చిన్న గదిలో నివసించింది. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. తండ్రి తన పిల్లల చదువుకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన దీపేష్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. ఆమె భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో చదివి 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% తో ఉత్తీర్ణత సాధించారు. తర్వాత జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో B.Tech, IIT బాంబే నుంచి M.Tech పట్టా పొందారు. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి సాలరీతో ఉద్యోగంలో చేరారు

ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత జాబ్ వదిలేసిన దీపేష్ సివిల్ సర్వెంట్ కావాలనే తన కలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. UPSC పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. 2020లో ఆమె మొదటి ప్రయత్నం విఫలం కాగా.. దీపేష్ నిరాస పడలేదు. మళ్ళీ తాను పొదుపుగా దాచుకున్న డబ్బుని ఉపయోగించి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లి మళ్ళీ UPSC పరీక్షకు సిద్ధం అయ్యారు.

2021లో దీపేష్ కృషికి ఫలితం దక్కింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్ సాధించి, EWS (ఆర్థికంగా వెనబడిన తరగతులు)విభాగంలో 4వ ర్యాంక్‌ను కూడా సాధించింది. ఆమె IAS అధికారిణిగా చేరి జార్ఖండ్ కేడర్‌కు నియమించబడింది. ఐఏఎస్ ఆఫీసర్ గా దీపేష్ కుమారి ను జార్ఖండ్ కి వెళ్ళారు. జార్ఖండ్ రోడ్డు రవాణా, హైవేస్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఆఫీసర్ గా ప్రజల్ల్లో పేరుగాంచారు.

About The Author