ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు.వైఎస్ షర్మిలా రెడ్డి


– యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు.

– రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు…రైతుల పంట పండేదెన్నడు ?

– యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ?

– యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు.

– యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్ కి కారణం అవుతున్నారని,

– రాష్ట్రంలో టాప్ 5 లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాలని,

– యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని,

– అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదం.

– రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసింది.

– ధాన్యాగారానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్ర రైతులకు వ్యవసాయం మీద నీతులు నేర్పడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం.

– యూరియా ఎక్కువ చల్లి రైతులు పండించే బియ్యం తినడానికి పనికిరావనడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లే.

– ఖరీఫ్ సీజన్ లో 14 లక్షల హెక్టార్లలో వరి సాగువుతుంటే ఎంత యూరియా అవసరమో తెలియదా ?

– రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతల అగచాట్లు కనిపించడం లేదా ?

– రాష్ట్రానికి రావలసిన యూరియా 6.65 లక్షల మెట్రిక్ టన్నుల కోటాలో ఇంకా లక్ష టన్నులు ఇవ్వకుండా కేంద్రం చోద్యం చూస్తుంటే ..

– మోడీ గారిని నిలదీసే దమ్ములేని మీరు రైతులదే తప్పు అన్నట్లు మాట్లాడటం నిజంగా బాధాకరం.

– ఉచిత సలహాలు పక్కన పెట్టి తక్షణం రాష్ట్ర రైతులకు సరిపడా యూరియా అందించండి.

– ఆ తర్వాత చేపట్టే సంస్కరణల మీద అవగాహన కల్పించండి.

About The Author