రైల్వే ఉద్యోగాల పేరుతో దోపిడీ వార్త పై చిన్నం వెంకటేశ్వరావు అలియాస్ ( చిన్నం చిన్న ) గట్టి కౌంటర్.


అమరావతి చానెల్‌లో ప్రసారమైన “రైల్వే ఉద్యోగాల పేరుతో కోట్లలో దోపిడీ” అనే వార్తపై మచిలీపట్నం భాస్కరపురం ప్రాంతానికి చెందిన చిన్నం వెంకటేశ్వరావు అలియాస్ ( చిన్నం చిన్న ) మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించారు…

ఎటువంటి సంబంధం లేకుండానే తన కుటుంబ ఫోటోలను చూపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు…

ముఖ్యంగా, తన 10 ఏళ్ల మైనర్ కుమార్తె ఫోటోను మార్ఫింగ్ చేసి ప్రసారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు…

“రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితురాలు అసలెవరో కూడా నాకు తెలియదన్నారు…

ఆమెతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మోసం చేసిన వ్యక్తి నా పేరు చెప్పాడని బాధితురాలు చెబితే, దాని ఆధారంగా నన్నే ఎలా దోషిగా చూపిస్తారు?” అని వెంకటేశ్వరావు ప్రశ్నించారు…

కేవలం ఎవరో తన పేరు ప్రస్తావించారనే కారణంతో కుటుంబ ఫోటోలను, ముఖ్యంగా మైనర్ బాలిక ఫోటోను ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు….

అమరావతి న్యూస్ ఛానల్‌కు చెందిన రిపోర్టర్ రాజేశ్వరావు తన కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసత్య సమాచారంతో కూడిన వార్తను ప్రసారం చేసినట్లు ఆయన ఆరోపించారు….

పూర్తి వీడియోను పరిశీలించగా, తమ కుటుంబానికి సంబంధం లేని అంశాలను కల్పించి ప్రచారం చేసినట్లు వెల్లడించారు…

మైనర్ బాలిక ఫోటోను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రసారం చేయడం కేవలం నైతిక విలువలకు విరుద్ధమే కాకుండా, చట్టపరంగానూ తీవ్రమైన తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు….

“మీడియా విచారణాధికారిగా వ్యవహరించాలా? లేక నిర్ధారణ లేకుండా కుటుంబాలను బహిరంగంగా నిందించాలా?” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు…

ఈ చర్య వల్ల తన కుమార్తె భవిష్యత్తు, కుటుంబ గౌరవం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు…

గతంలో కూడా ఇదే రిపోర్టర్ తప్పుడు కథనాలు ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయని, పలుమార్లు మందలించిన నేపథ్యంలో వ్యక్తిగత విద్వేషంతో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు….

నిర్ధారణ లేకుండా వార్తల పేరుతో వ్యక్తుల పరువు తీసే ధోరణి ఆపాలని ఆయన డిమాండ్ చేశారు…

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి మైనర్ బాలిక ఫోటోను ప్రసారం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నం వెంకటేశ్వరావు విజ్ఞప్తి చేశారు..

About The Author