గాయాలు, పుండ్లు అయిన వారు ప‌ప్పు తినవచ్చా… తింటే చీము ప‌డుతుందా ? నిజ‌మెంత ?


గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు భేషుగ్గా ప‌ప్పు తిన‌వ‌చ్చ‌*
గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు ప‌ప్పు తింటే చీము ప‌డుతుంద‌ని అన‌డంలో ఎంత‌మాత్రం నిజం లేదు.అదంతా వ‌ట్టిదే నిజానికి అలాంటి స్థితిలో ప‌ప్పు తింటేనే మంచిది.ఎందుకంటే ప‌ప్పులో ప్రోటీన్లు బాగా ఉంటాయి. అవి గాయాలు, పుండ్ల‌ను త్వ‌ర‌గా మానేలా చేస్తాయి. అందువ‌ల్ల గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు ప‌ప్పును నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. అంతేకానీ ఆ స్థితిలో ప‌ప్పును తింటే చీము ప‌డుతుంద‌ని అస్స‌లు అనుకోరాదు. భేషుగ్గా ప‌ప్పును తిన‌వ‌చ్చు.

*అయితే చీము ఎందుకు ప‌డుతుంది ?*
అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే.. గాయాలు లేదా పుండ్లు అయిన‌ప్పుడు వాటిని రోజూ శుభ్రం చేయాలి. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్ అయి చీము ప‌డుతుంది. ఇక వాటి స్థానంలో సూక్ష్మ క్రిముల‌తో తెల్ల ర‌క్త క‌ణాలు పోరాటం చేస్తాయి. దీంతో అవి చ‌నిపోతాయి. ఈ క్ర‌మంలో అవి చీముగా మ‌న‌కు క‌నిపిస్తాయి.

ఆల‌స్య‌మైనా అవి ఇన్‌ఫెక్ష‌న్‌కు దారితీసి చీము ప‌డుతుంది. దీంతోపాటు దుమ్ము, ధూళి ఎక్కువ‌గా ప‌డ‌డం, ప‌లు ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల అవి మాన‌డం ఆల‌స్యం అవుతుంది. ఈ క్ర‌మంలో చీము ఎక్కువ‌గా చేరుతుంది. చీములో చ‌నిపోయిన క‌ణాలు, ఇత‌ర క‌ణ‌జాలం, తెల్ల ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే చీముకు, ప‌ప్పుకు ఎంత‌మాత్రం సంబంధం లేదు. గాయాలు, పుండ్లు అయిన‌వారు నిర‌భ్యంత‌రంగా ప‌ప్పును తిన‌వ‌చ్చు. దాంతో చీము ఏమీ ప‌ట్ట‌దు.

కావున, ఈ సమాచారాన్ని అపోహలు ప్రభావితం కాకుండా ఉండేందుకు మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో షేర్ చేయండి.

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేశ్వరరావు 9392857411.*

About The Author