బేబీ పాట విడుదల చేసిన రఘు కుంచె …

బేబీ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిన పల్లె మహిళ. తాను పాడిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చలియా నా ప్రియా సఖియా’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటకు ఎందరో నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. స్వయంగా ఆ పాటను కంపోజ్ చేసిన ఏఆర్ రహమాన్ కూడా ఫిదా అయిపోయి తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడం చూసాం.ఎందరో సంగీత దర్శకులు ముందుకు వచ్చి బేబీతో పాట పాడిస్తామని తెలిపారు. వారిలో ఒక సంగీత దర్శకుడు రఘు కుంచె. ఆయన చెప్పినట్టుగా బేబీతో ఓ పాటను పాడించారు.. అదే ‘మట్టి మనిషినమ్మ నేను మాణిక్యమన్నారు నన్ను..’ ఈ పాటను గురువారం రోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బేబీ మధురమైన గొంతుకు సంగీతప్రియులు ఫిదా అవుతున్నారు.

About The Author