అరుణాచలంలో మోక్ష మార్గం దీని ప్రాశస్త్యం గత 30 ఏళ్లుగా …

అరుణాచలంలో మోక్ష మార్గంలో మణికుమార్ అనే రాజముండ్రికి చెందిన ఓ భక్తుడు మరణించిన ఘటనతో ఈ మోక్షమార్గం పేరు ఎప్పటిది… అన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి తమిళనాట ప్రచారంలో ఉన్న కథల్లో ఇడుక్కి పిల్లయార్ ఆలయం మోక్షమార్గం అని చెప్పరు. దీని ప్రాశస్త్యం గత 30 ఏళ్లుగా విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. వాస్తవంగా అక్కడ ఏ దేవుడు గుడి లేదు. దానికి మోక్ష మార్గం అన్న పేరు కూడా లేదు. అది ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ప్రవచన కారులు పెట్టిన పేరు. తమిళనాడులో ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ధనపాల్ అనే ఓ వ్యాపారి తనకు వ్యాపారంలో వచ్చిన సంపదలో కొంత భాగాన్ని అరుణాచలేశ్వరుడికి ఇవ్వాలని సంకల్పం చేసుకొని గిరి ప్రదక్షణకు వచ్చాడు. ఆ సమయంలో ఈ గుహ కనిపించింది. అంతకుముందే తను మొదట అనుకున్నట్టు కాకుండా తనకొచ్చిన లాభంలో అనుకున్నట్టు కాకుండా దాన్ని మరింత తగ్గించాలని ఆలోచనతో గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ సమయంలో కొంతమంది భక్తులు ఈ గుహ నుంచి లోపలకు వెళ్ళి బయటకు వస్తున్నారు. అప్పుడు అతడికి ఈ గుహ ప్రాశస్త్యం గురించి తెలియదు. అప్పుడు ధనపాల్ కూడా ఆ గుహ నుంచి బయటకు వచ్చే.ప్రయత్నించడంతో లోపలి ఇరుక్కుపోయాడు. ఎంతకీ బయట వచ్చే అవకాశం లేకపోతే విగ్నేశ్వరుని ప్రార్థించాడు. తన దగ్గర ఉన్న బంగారం మొత్తం దేవుడికే ఇచ్చేస్తానని మొక్కాడు. అప్పుడు గుహ కొంచెం వెడల్పు అయిందని తను బయటపడ్డాడని కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాతనే తన సంపాదన. ముందు అనుకున్నట్టు అరుణాచలేశ్వరుడికి సమర్పించుకున్నారని చెబుతారు. మనిషి తనలో గర్వాన్ని తన అహంకారాన్ని తన ఆబిజిత్యాన్ని వదులుకొని భగవంతుడికి సర్వ శరణాగతి చెందితే నిజమైన భగవంతుడి కరుణ సిద్ధిస్తుందని దీని అర్థం. మనిషిలోని అహంకారాన్ని పోగొట్టాలని సంకల్పంతో ఈ గుహలోకి ప్రవేశించి బయటకు వస్తారు. ఎలాంటి వారైనా సరే ఎంత సంపన్నులు అయినా సరే భగవంతుడికి సర్వస్వ శరణాగతి చెందాల్సిందే నన్న ఒక ఆలోచనతో వారిలోని అహంకారాన్ని , ఆధిపత్య భావనను పోగొట్టే విధంగానే ఈ గుహను తర్వాత తమిళ ఆధ్యాత్మిక వేత్తలు వర్ణించారు. అంతకుమించి దీనికి ఎలాంటి పురాణ ప్రాశస్త్యమూ లేదు. పురాణకాలం నాటి విశేషము లేదు. ఇడికి అంటే ఇరుకైనది .పిల్లయ్యారంటే గణేశుడు. నిజంగా అక్కడ ఆలయం కూడా లేదు. ఈ గుహకు మోక్ష మార్గం అన్న పేరు వచ్చి పేరు. పెట్టింది తెలుగువాళ్లే. చెప్పే వాడికి వినే వాడు లోకువ.. అలాగని ఆకట్టుకొనే విధంగా అబద్ధాలకు పురాణ కథలు జోడించి చెబితే అసలుకే మోసం వస్తుందని పెద్దలు గ్రహించాలి.
