ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్…

ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరుఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటన్నంటినీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం చెప్పారు. హామీల అమలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని, వాటికి నిధుల కొరత లేని విధంగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, ఆర్థిక సలహాదారు శ్రీ జి.ఆర్.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఇ.ఎన్.సి. శ్రీ మురళీధర్, ఆర్ అండ్ బి ఇఎన్సీలు శ్రీ గణపతి రెడ్డి, శ్రీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author