వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఈటెల రాజేందర్…

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఈటెల రాజేందర్..తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు.నాణ్యమైన వైద్యం అందాలని కేసీఆర్ కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు.మొత్తం దేశంలో కేరళ తమిళనాడు అగ్రగామి.నా సహచర మంత్రి గా పనిచేసిన లక్ష్మారెడ్డి అనేక పనులు చేశారు.మన దేశంలో మన రాష్ట్రం ముందుండాలని కోరుకున్నారు.ఎంత ఖర్చైన పెట్టండి.కానీ పేదవారికి అందరికి నాణ్యమైన వైద్యం అందాలని కేసీఆర్ చెప్పారు.వైద్యం చేసే డాక్టర్లపై దాడులు సరికాదు.
అందుబాటులో ఉన్న వైద్యులు పేషంట్ల కు వైద్యం అందిస్తారు.నిన్న గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేశారు,
అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము…
సకాలం లో వైద్యం అందించాలని డాక్టర్లు వైద్యం చేస్తారు,
అలాంటి వారిపై దాడులు సరికాదు…వెంటనే జూడాలు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్న.

About The Author