*భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త‌ పరిస్థితులు ఏర్పడుతాయని రెండేళ్ళ క్రితమే తెలుసు…* పవన్‌ కళ్యాణ్

*భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త‌ పరిస్థితులు ఏర్పడుతాయని రెండేళ్ళ క్రితమే తెలుసు…* పవన్‌ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల వేళ భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని తనకు రెండేళ్ళక్రితమే తెలుసునని, ఆవిషయాన్ని కొందరు భాజపా ముఖ్య నేతలు తనకు చెప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

భారతీయ జనతా పార్టీ శ్రేణులు తాము మాత్రమే దేశభక్తులం అన్న రీతిలో ప్రవర్తిస్తోందని, వారికంటే ఎక్కువ దేశభక్తి తమకూ ఉందని, కానీ మేము దాన్ని ప్రచారం కోసం వాడుకోము అంటూ ఘాటు విమర్శలు చేసారు.

దేశంలోని ముస్లింలు ఇప్పుడు ప్రత్యేకంగా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసంలేదు, పాకిస్తాన్ లోని హిందువుల పరిస్థితి ఏమిటో తెలియదు కానీ‌… ఇక్కడి ముస్లీంలను గుండెల్లో పెట్టుకు చూసుకొంటారని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుంది అని పెర్కొన్నారు జనసేనాని.

About The Author