మీరు ఒక్క సిట్ వేస్తే… మేము రెండేస్తాము…

 

*మీరు ఒక్క సిట్ వేస్తే… మేము రెండేస్తాము…*

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్యే కాదు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి… డేటా తస్కరణపై తెలంగాణ సర్కార్, సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయగా…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇద్దరు సీనియర్ అధికారులతో రెండు ప్రత్యేక విచారణ బృందాలను… అదేనండీ… స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) లను ఏర్పాటు చేసింది…

అడిషనల్ డీజీపీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందం, నిన్న అధికార టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు పై తుళ్ళూరు పోలీసులు నేడు నమోదు చేసిన కేసును విచారించనుండగా… మరో సీనియర్ అధికారి, ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ని బృందం… రాష్ట్రం లో ఫామ్-7 పై నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్-7 పై ఇప్పటివరకు 252 ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

About The Author