జబర్దస్త్ షోకి జడ్జీలు ఛేంజ్.. ఎందుకంటే..


జబర్దస్త్ షోకి జడ్జీలు ఛేంజ్.. ఎందుకంటే..

హైదరాబాద్ ;- రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ బుల్లితెరపై నవ్వులు పూయించే షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది నటులు బిగ్ స్క్రీన్‌పై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఆద్యంతం కామెడీ పండించే ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. మరి ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ హడావిడి.

అందునా నాగబాబు జనసేన పార్టీ తరపున నర్సాపురం నుంచి లోకసభకు పోటీ చేస్తున్నారు.

ఇక రోజా వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. పోలింగ్ గడువు దగ్గర పడడంతో నాయకుల ప్రచార పర్వం ఊపందుకుంది.

ఈ బిజీ షేడ్యూల్‌లో జబర్ధస్త్‌నుంచి జడ్జి పోస్టుకి కాస్త విరామమిచ్చారు.

ఈ ఇద్దరూ నటులు. వారి స్థానంలో నటి మీనా, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ప్రొమోని కూడా వీరిపై చిత్రీకరించారు. మరి ఎన్నికల అనంతరం వీరే కొనసాగుతారా లేక రోజా, నాగబాబు వచ్చేస్తారా అనేది వేచి చూడాలి.

About The Author