హైదరాబాద్‌ లో కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు…


సొంతూళ్లకు నగరవాసులు క్యూ కడుతున్నారు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిపోతున్నాయి. పోలింగ్‌కు ఒక రోజు ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు పరుగులు పెడుతుండటంతో బస్టాండ్లు, రైల్వేస్షేషన్లలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి భారీ సంఖ్యలో జనం సోంతూళ్ల బాట పట్టడంతో మంగళవారం ఉదయం నుంచి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ ఆర్టీసీ ఎంజీబీఎస్‌, సీబీఎస్‌, జూబ్లీ బస్టాండ్ల నుంచి రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని రంగారెడ్డి రీజియన్‌ అధికారి తెలిపారు.
_

About The Author