ఏపీలో 76.69 శాతం పోలింగ్‌…

ఏపీలో భారీగా పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 76.69 శాతం పోలింగ్‌ జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు ఓటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి వరకు నమోదైన పోలింగ్‌ అంచనాలను ఈసీ వెల్లడించింది. పూర్తి వివరాలు మధ్యాహ్ననికి వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండు నుంచి మూడు శాతం ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో 72 శాతం, విజయనగరం 85, విశాఖ 70, తూర్పు గోదావరి 81, పశ్చిమ గోదావరిలో 70, కృష్ణా 79, గుంటూరు 80, ప్రకాశం 85, నెల్లూరు 75, కడప 70, కర్నూలు 73, అనంతపురం 78, చిత్తూరులో 79 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

About The Author