మున్సిపల్ కార్యాలయం ముందు మహిళల ధర్నా.. పలమనేరు …


తాగునీటి కోసం మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన మహిళలు సుమారు 20 మంది దాకా స్థానిక నాయకుల తో కలిసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో నీరు వచ్చి సుమారు 10 రోజులైనట్లు వారు వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏఈ లోకేష్ ను వివరణ కోరగా ఈ నెల 13 వ తేదీన గంటావూరు కాలనీకి నీరు వదిలినట్లు తెలిపారు. తాము ప్రతిరోజూ నీటిని విడుదల చేసే సమయాన్ని డైరీలో నమోదు చేసి స్థానికుల సంతకాలు, మొబైల్ నంబర్లు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

About The Author