శ్రీలంక ప్రెసిడెంట్ గౌ.మైత్రిపాల సిరిసేన వారికి ఘనస్వాతం

రేణిగుంట, ఏప్రిల్ 16: రెండురోజుల తిరుమల పర్యటన నిమిత్తం మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శ్రీలంక ప్రసిడెంట్ గౌ.మైత్రిపాల సిరిసేన వారి కుటుంబ సభ్యులకు  ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న , ఎపి ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ కల్నల్ అశోక్ కుమార్ , తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, స్వాగతం పలికిన వారిలో వున్నారు. శ్రీలంక మంత్రి అపోన్స్, డిప్యూటీ హై కమిషనర్ కృష్ణమూర్తి, ఎయిపోర్టు డైరెక్టర్ శివకుమార్,ఎయిర్ పోర్ట్ సిఐ ఎస్ ఎఫ్ అధికారి మనీష్, రాజశేఖర్, తహశీల్దార్ మాధవ కృష్ణా రెడ్డి, విమానాశ్రయం లో ఏర్పాట్లు పర్యవేక్షించారు. విమానాశ్రయం నుండి తిరుమల బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి  సుప్రభాత సేవలో పాల్గొని  రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. — డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి—-

About The Author