ఏపీలో రీపోలింగ్‌ నిర్వహించే కేంద్రాలు…

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో… హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల దృష్ట్యా 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది మంగళవారం సిఫారసు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు ఆయా జిల్లాల కలెక్టర్లు చేసిన ప్రతిపాదనలను, కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఏయే కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు….

తాజాగా ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం 94వ పోలింగ్‌ కేంద్రం, గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు 244వ కేంద్రం, నెల్లూరు జిల్లా పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ కేంద్రం, సూళ్లూరు పేటలోని అటకానితిప్ప 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కలనూతల 247వ పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ రీపోలింగ్‌ ఎప్పుడు నిర్వహించేది, తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.

About The Author