రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లెడ్ బ్యాచ్ వీరంగం…

రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లెడ్ బ్యాచ్ వీరంగం, ప్రయాణికులపై దాడి చేస్తుండగా అడ్డుకున్న టీసి ఉమామహేశ్వరరావు, టిసి పై దాడి ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు అరెస్ట్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీసీ సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డావారిని హాస్పిటల్‌కి తరలి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసినవారిని తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌గా గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి గత నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. వీరిలో ఒకరి మానసిక పరిస్థితి సరిగాలేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

 

About The Author