శ్రీలంక రాజధాని కొలంబో చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస జంటపేలుళ్లు…


శ్రీలంకలో జంటపేలుళ్లు…
శ్రీలంక రాజధాని కొలంబో చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస జంటపేలుళ్లు
ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు.
300 మందికి పైగా గాయపడ్డారు…
చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉంది…
శ్రీలంక పేలుళ్లలో 160కు చేరిన మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 160 మంది మృతిచెందినట్లు సమచారం.

మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు.

ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక పార్థలనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు సమాచారం.

మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి.

కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి.

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామన్నారు.

దీనిపై మరికాసేపట్లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమాచారం నిర్వహించనున్నారు.

About The Author