తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ ఛైర్మన్ శ్రీ జి.రాజేశం గౌడ్, సతీసమేతంగా…

ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ ఛైర్మన్ శ్రీ జి.రాజేశం గౌడ్, సతీసమేతంగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనినారు.
శ్రీ జి.రాజేశం గౌడ్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వాదం పొందినారు. తదనంతరం తిరుమల తిరుపతి దెవస్థానం జే.ఇ.ఓ. శ్రీ శ్రీనివాసరాజు, I.A.S., జి.రాజేశం గౌడ్, దంపతులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేష వస్త్రాన్ని మరియు చిత్రపటాన్ని బహుకరించినారు.
ఈ సందర్బంలో శ్రీ జి.రాజేశం గౌడ్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వుండాలని ఆ వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలియజేసినారు.

About The Author